వార్ 2 అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నారు. డ్రగ్ మాఫియాలో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా ఈ చిత్రం తెరకెక్కనుందంటూ అంటూ ప్రచారం జరుగుతుంది. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రకటించి చాలా ఏళ్ళు అవుతుంది. సలార్ కంటే ముందే ఈ మూవీ మొదలు కావాల్సింది. ఇతర కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది.
ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ప్రశాంత్ నీల్ సంక్రాంతి అనంతరం స్టార్ట్ చేస్తున్నారట. ప్రచారం జరిగినట్లే రుక్ష్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అట. అలాగే మలయాళ పాప్యులర్ స్టార్స్ తోవినో థామస్, బిజు మీనన్ కీలక రోల్స్ చేస్తున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.