`భీమిలీ కబడ్డీ జట్టు`, `ఎస్.ఎం.ఎస్`(శివ మనసులో శృతి)తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మాతలుగా ఈ మూవీ రూపొందబోతుంది. సోమవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్లో జరిగాయి.
ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, చిత్ర సమర్పకులు జెమినీ కిరణ్, నిర్మాతలు హరీష్ పెద్ది, వి.ఆనంద ప్రసాద్, అన్నే రవి, డైరెక్టర్ తాతినేని సత్య తండ్రి, సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ సహా పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత హరీష్ పెద్ది క్లాప్ కొట్టారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా,సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ, `ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్టైనర్గా ‘సతీ లీలావతి’ రూపొందుతుంది. మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామా. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో తెరకెక్కిస్తున్నాం. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జోడీ ఫ్రెష్ లుక్తో మెప్పించనున్నారు.
సినిమా రెగ్యులర్ షూటింగ్ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. చిత్ర నిర్మాతలు నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి మాట్లాడుతూ , `తాతినేని సత్యగారు స్క్రిప్ట్ చెప్పగానే నేటి తరం ఆడియెన్స్కు కనెక్ట్ అయ్యే సినిమా అనిపించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాగా దీన్ని రూపొందిస్తున్నాం. సినిమా రెగ్యులర్ షూటింగ్ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తాం` అని అన్నారు. హీరో వరుణ్ తేజ్కి, నిర్మాత కిరణ్కి వారు ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయ్యిందనే రూమ్లు వచ్చాయి. తాజాగా సినిమా ప్రారంభించి ఆ రూమర్లకి చెక్ పెట్టింది. ఇకపై తాను వరుసగా సినిమాలు చేయబోతుందనే విసయాన్ని స్పష్టం చేసింది. పిల్లలకు టైమ్ తీసుకుంటున్నట్టు దీని బట్టి అర్థమవుతుంది.
read more: 100 Crore Loss movies: వంద కోట్లకుపైగా నష్టాలను తెచ్చిన సినిమాలు.. ప్రభాస్, రామ్ చరణ్ సేమ్, సూర్య టాప్
also read: Anasuya Comments: ఫుడ్ లాగే అది కూడా ప్రాథమిక అవసరం, బల్లగుద్ది చెప్పిన అనసూయ.. ట్రోలర్స్ కి మైండ్ బ్లాక్