షాకింగ్: లెజెండరీ గాయని లతా మంగేష్కర్‌‌కి స్లో పాయిజన్ ఇచ్చారు..!

Published : Apr 29, 2020, 12:05 PM IST

భారతీయ సంగీతానికి సినీ నేపథ్యగానానికి విశేష సేవలందించిన లెజెండరీ గాయని లతా మంగేశ్కర్‌. తన జీవితాన్ని పూర్తిగా సంగీతానికే అంకితం చేసిన ఈ మహాగాయని జీవితంలో ఓ చేదు అనుభవం కూడా ఉంది. గతంలో లతాజీకి స్లో పాయిజన్ ఇచ్చారాట.. ఈ వివరాలేంటో చూద్దాం.

PREV
18
షాకింగ్: లెజెండరీ గాయని లతా మంగేష్కర్‌‌కి స్లో పాయిజన్ ఇచ్చారు..!

గాయని లతా మంగేష్కర్‌కు అత్యంత సన్నిహితుడైన పద్మ సచ్‌దేవ్‌, లతాజీ జీవితంపై ఓ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలోనే తొలిసారిగా లతా మంగేశ్కర్‌కు స్లో పాయిజన్‌ ఇచ్చారన్న విషయాన్ని వెల్లడించారు రచయిత.

గాయని లతా మంగేష్కర్‌కు అత్యంత సన్నిహితుడైన పద్మ సచ్‌దేవ్‌, లతాజీ జీవితంపై ఓ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలోనే తొలిసారిగా లతా మంగేశ్కర్‌కు స్లో పాయిజన్‌ ఇచ్చారన్న విషయాన్ని వెల్లడించారు రచయిత.

28

లతా మంగేష్కర్ నేపథ్య గాయనిగా పది వేలకుపైగా పాటలను ఆలపించారు.  భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలకు గాను ఆమెను నైటింగేల్‌ ఆఫ్ ఇండియా అంటూ కీర్తిస్తారు. భారత రత్న సాధించిన ఈ మహా గాయనిని ఒక దశలో కొందరు వ్యక్తులు హత్య చేసేందుకు ప్రయత్నించారట.

లతా మంగేష్కర్ నేపథ్య గాయనిగా పది వేలకుపైగా పాటలను ఆలపించారు.  భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలకు గాను ఆమెను నైటింగేల్‌ ఆఫ్ ఇండియా అంటూ కీర్తిస్తారు. భారత రత్న సాధించిన ఈ మహా గాయనిని ఒక దశలో కొందరు వ్యక్తులు హత్య చేసేందుకు ప్రయత్నించారట.

38

లతాజీ జీవితం ఆధారంగా రాసిన ఐసా కహన్‌ సే లావూన్‌ పుస్తకంలో తొలిసారిగా లతాజీ మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి వివరించాడు. 1963లో ఆమె మీద ఈ కుట్ర జరిగినట్టుగా వెల్లడించాడు. అయితే దేవుడి దయ వల్ల ఆమెకు ఏమీ జరగలేదని వెల్లడించాడు.

లతాజీ జీవితం ఆధారంగా రాసిన ఐసా కహన్‌ సే లావూన్‌ పుస్తకంలో తొలిసారిగా లతాజీ మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి వివరించాడు. 1963లో ఆమె మీద ఈ కుట్ర జరిగినట్టుగా వెల్లడించాడు. అయితే దేవుడి దయ వల్ల ఆమెకు ఏమీ జరగలేదని వెల్లడించాడు.

48

పద్మ సచ్‌దేవ్ చెప్పిన లతాజీ స్వయంగా తన మీద జరిగిన హత్య ప్రయత్నం గురించి తనతో చెప్పారని వెల్లడించాడు. తన 33 ఏళ్ల వయసులో అంటే 1963లో లతాజీకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. రెండు మూడు సార్లు పచ్చ రంగులో వాంతులు కూడా  అయ్యాయి. ఆ సమయంలో లతా జీ తన చేతులు కూడా కదిలంచలేకపోయారు. ఒల్లంతా తీవ్రమైన నొప్పులు వచ్చాయి.

పద్మ సచ్‌దేవ్ చెప్పిన లతాజీ స్వయంగా తన మీద జరిగిన హత్య ప్రయత్నం గురించి తనతో చెప్పారని వెల్లడించాడు. తన 33 ఏళ్ల వయసులో అంటే 1963లో లతాజీకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. రెండు మూడు సార్లు పచ్చ రంగులో వాంతులు కూడా  అయ్యాయి. ఆ సమయంలో లతా జీ తన చేతులు కూడా కదిలంచలేకపోయారు. ఒల్లంతా తీవ్రమైన నొప్పులు వచ్చాయి.

58

మూడు రోజుల పాటు మరణానికి చేరువగా ఉన్న ఆమె తరువాత పది రోజుల్లో కొంత మెరుగయ్యారు. తరువాత కొంత కాలానికి కోలుకున్నారు. ఆ సమయంలో డాక్టర్లు ఆమెతో స్లో పాయిజన్‌ కారణంగా ఇలా జరిగిందని చెప్పారు.

మూడు రోజుల పాటు మరణానికి చేరువగా ఉన్న ఆమె తరువాత పది రోజుల్లో కొంత మెరుగయ్యారు. తరువాత కొంత కాలానికి కోలుకున్నారు. ఆ సమయంలో డాక్టర్లు ఆమెతో స్లో పాయిజన్‌ కారణంగా ఇలా జరిగిందని చెప్పారు.

68

విషయం తెలిసిన వెంటనే లతా మంగేశ్కర్‌ వంట మనిషిని తొలగించారు. అతను కూడా కనీసం జీతం తీసుకోవడానికి కూడా రాకుండా వెళ్లిపోయాడని పద్మ  సచ్‌దేవ్ తన పుస్తకంలో వెల్లడించారు.

విషయం తెలిసిన వెంటనే లతా మంగేశ్కర్‌ వంట మనిషిని తొలగించారు. అతను కూడా కనీసం జీతం తీసుకోవడానికి కూడా రాకుండా వెళ్లిపోయాడని పద్మ  సచ్‌దేవ్ తన పుస్తకంలో వెల్లడించారు.

78

ఆ తరువాత కొంత కాలం పాటు లతా జీ తినే ఆహారాన్ని పరీక్షించిన తరువాత ఆమెకు వడ్డించారు. ఎక్కువగా లిరిసిస్ట్  మజ్‌రూహ్‌ సుల్తాన్‌పురీ ఆమె ఆహారాన్ని పరీక్షించేవారట.

ఆ తరువాత కొంత కాలం పాటు లతా జీ తినే ఆహారాన్ని పరీక్షించిన తరువాత ఆమెకు వడ్డించారు. ఎక్కువగా లిరిసిస్ట్  మజ్‌రూహ్‌ సుల్తాన్‌పురీ ఆమె ఆహారాన్ని పరీక్షించేవారట.

88

గతంలో ఓ లండన్ బేస్డ్‌ సినీ రచయితకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా లతా మంగేశ్కర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న లతాజీ ఎక్కువగా ఇంటికే పరిమితిమవుతున్నారు.

గతంలో ఓ లండన్ బేస్డ్‌ సినీ రచయితకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా లతా మంగేశ్కర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న లతాజీ ఎక్కువగా ఇంటికే పరిమితిమవుతున్నారు.

click me!

Recommended Stories