అన్నింటికి నా భర్తే కారణం.. నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

First Published Jan 11, 2024, 9:18 AM IST

తన భర్త విష్నేష్ శివన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ నయనతార. తాజాగా సేలంలో జరిగిన ఓ కార్యక్రమంలో నయన్ మాటలకు అంతా ఆశ్చర్యపోయారు. 

తన భర్త గురించి చెపుతు ఎమోషనల్ అయ్యింది నయనతార. జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన నయనతార.. యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్ళాడి.. సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తోంది. సినిమాలతో పాటు పలు బిజినెస్ లు కూడా చేస్తూ.. చేతినిండా సంపాదిస్తున్నారు జంట. ఇందులో భాగంగా 9స్కిన్ అనే స్కిన్ కేర్ బ్యూటీ ప్రాడెక్ట్ ను స్టార్ట్ చేసి.. సక్సెస్ అయిన నయనతార.. తాజాగా మరో బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యింది. 

రైతుల నుంచి నేరుగా సహజ ఉత్పత్తులను విక్రయించే డివైన్ బడ్స్ కంపెనీ స్టార్ట్ చేశారు నయన్ దంపతులు. ఆతరువాత పెమీ9 అనే నాప్‌కిన్ బ్రాండ్‌ ను కూడా ప్రారంభించారు. అయితే ఈ బిజినెస్ లో సక్సెస్ ను సాధించిన సందర్భంగా..విజయాన్ని పురస్కరించుకుని సేలం లో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  తన భర్త విష్నేష్ తో కలిసి హాజరయ్యింది నయనతార.
 

Latest Videos


ఈసందర్భంగా ఆమె తన  భర్త విఘ్నేష్ శివన్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అతని గురించి మాట్లాడుతూ.. నయన్ ఎమోషనల్ అయ్యింది.  నయనతార మాట్లాడుతూ..‘‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని అందరూ ఎప్పుడూ చెబుతుంటారు. కానీ  నేడు అందులో చాలా మార్పులు వచ్చాయి.  విజయవంతమైన మహిళలందరి వెనుక, ఖచ్చితంగా ఒక పురుషుడు ఉన్నాడు. దానికి నేనే ఉదాహరణ అన్నారు. 
 

 నేను నా భర్తను కలిసినప్పటి నుండి చాలా సంతోషంగా ఉన్నాను. అతను నన్ను ప్రతీ క్షణం నడిపిస్తున్నాడు. ఏమి చేయాలో చెబుతూనే ఉన్నాడు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని నన్ను ఎప్పుడూ అడగలేదు. ఆయన్ను కలిసేంత వరకు నా జీవితం ఒకలా ఉంది. కలిసిన తరువాత మరోలా ఉంది. ఇంత అర్హత ఉండి కూడా కొన్ని పనులు ఎందుకు చేయలేదు నువ్వు  అని నన్ను ప్రశ్నించారు. నేను చేయగలను అని నన్ను నాకు కొత్తగా పరిచయం చేశారు నాభర్త అని గర్వంగా చెప్పింది నయనతార. 

nayanthara

Pemi9 అనే బ్రాండ్ ఈరోజు ఇలా ఉందంటే దానికి నేను కారణం కాదు. సామాజిక బాధ్యతతో ఇలాంటివి చేద్దాం అని చెప్పడమే కాకుండాఇంత గ్రాండ్‌గా ఈవెంట్‌ని నిర్వహించినందుకు తన భర్త విఘ్నేష్ శివన్‌కి కృతజ్ఞతలు తెలిపింది నయనతార. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ అయ్యప్ప మాలలో ఉండటంతో.. తన స్పీచ్ చివరగా  తన భర్త విఘ్నేశ్  శివున్ ను  చూస్తూ సామీ శరణం అంటూ తన ప్రసంగాన్ని ముగించింది.
 

ఇక నయనతార పెళ్లి.. పిల్లల తరువాత కూడా కెరీర్ రెట్టింపు స్పీడ్ తో పరుగులు పెట్టిస్తోంది. ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు ఇండస్ట్రీలో. స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ.. దూసుకుపోతోంది. ఈమధ్యే ఆమె నటించిన అన్నపూరణి  మూవీ వివాదాలకు కారణం అయ్యింది. 
 

click me!