జట్టులో ప్రతీ ఒక్క ఆటగాడు తమవంతుగా మెరుగైన ప్రదర్శన చేయాలి. అలా అయితేనే టీమిండియా ప్రపంచకప్ నెగ్గుతుంది. ఒక్కరిద్దరు ఆటగాళ్ల ఆట మీద ఆధారపడితే ప్రయోజనం లేదు. బ్యాటర్లలో కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ లతో పాటు బౌలర్లు కూడా రాణించాలి. ప్రతీ ఆటగాడు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడే విజయాలు సొంతమవుతాయి..’ అని దాదా తెలిపాడు.