అయితే ఈ టోర్నీలో భారత జట్టు ప్రధాన వైఫల్యంగా చెప్పుకుంటున్న తుది జట్టు ఎంపికపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. ఇదే విషయమై మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.