ఇదిలాఉంటే భారత బౌలింగ్ దళం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లు సిరీస్ లో రాణించారు. మూడు టెస్టులలోనూ దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్సులో ఆలౌట్ చేశారు. రెండో టెస్టులో భారత్ మరో 60 పరుగులు చేసి ఉంటే షమీ చెప్పినట్టే ఫలితం మరో విధంగా ఉండేది.