IND vs ENG: బౌండరీల మోత.. యశస్వి జైస్వాల్ మరో ఘనత

First Published Feb 19, 2024, 11:27 AM IST

India vs England : రాజ్‌కోట్ లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులోనూ యశస్వి జైస్వాల్ డ‌బుల్ సెంచరీ కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ సరికొత్త రికార్డు సాధించాడు.  
 

Yashaswi Jaiswal

IND vs ENG - Yashasvi Jaiswal : భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు నేప‌త్యంలో టీమిండియా ఆట‌గాళ్లు  రాజ్‌కోట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించారు. భార‌త ప్లేయ‌ర్లు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశారు.

టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ త‌న అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో మ‌రో డ‌బుల్ సెంచ‌రీ కొట్టాడు. డబుల్ సెంచరీ మాత్రమే కాదు, గ్రౌండ్ లో ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల రికార్డు బద్దలు కొట్టాడు. 

Yashasvi Jaiswal

టెస్టు క్రికెట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్ మరో ఘనత సాధించాడు. ఇది వరకు ఒక ఇన్నింగ్స్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మయాంక్ అగర్వాల్ అత్యధికంగా 8 సిక్సర్లు బాదాడు. 

Yashasvi Jaiswal

1994లో లక్నోలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిద్ధూ 8 సిక్సర్లు బాదాడు . దీని తర్వాత, 2019లో ఇండోర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ 8 సిక్సర్లు కొట్టాడు. వీరిని జైస్వాల్ అధిగమించాడు. 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఈ సిరీస్‌లో జైస్వాల్ 20 సిక్సర్లు కొట్టి, ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతకుముందు విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో జైస్వాల్ 209 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మినహా జైస్వాల్ ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడాడు. అతను ఈ కాలంలో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో సహా 11 ఇన్నింగ్స్‌లలో 57.90 సగటుతో 637 పరుగులు చేశాడు.

click me!