మహిళా ప్రీమియర్ లీగ్: 6 6 6 6.. దంచి కొట్టిన ఆష్లీ గార్డనర్

Published : Feb 14, 2025, 10:08 PM IST

WPL 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఎడిషన్ ఫిబ్రవరి 14న ఘనంగా ప్రారంభం అయింది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆష్లీ గార్డనర్ దంచికొట్ట‌డంతో గుజ‌రాత్ జెయింట్స్  201 ప‌రుగులు చేసింది.   

PREV
15
మహిళా ప్రీమియర్ లీగ్: 6 6 6 6.. దంచి కొట్టిన ఆష్లీ గార్డనర్
Ashleigh Gardner

Royal Challengers Bengaluru vs Gujarat Giants: మ‌హిళా ప్రీమియర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) 2025 ఘ‌నంగా ప్రారంభం అయింది. 2023లో జరిగిన తొలి ఎడిషన్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్‌లో స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ తొలి WPL టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. రెండు సార్లు ఫైన‌ల్ కు చేరిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిరాశే ఎదురైంది. ఇప్పుడు మ‌హిళా ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) మూడో సీజ‌న్ మొద‌లైంది.

25
wpl , wpl 2025, cricket,

WPL 2025 ఓపెనర్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు-గుజ‌రాత్ జెయింట్స్ టీమ్స్ త‌లప‌డ్డాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ జెయింట్స్ ప్లేయ‌ర్లు సూప‌ర్ బ్యాటింగ్ తో దంచి కొట్టారు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగులు చేసింది. 

గుజ‌రాత్ టైటాన్స్ దెబ్బ‌కు వ‌ణికిపోయిన ఆర్సీబీ బౌల‌ర్లు 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ జెయింట్స్ ఆరంభం నుంచి అద‌రిపోయే బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించింది. దీంతో 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 201 ప‌రుగులు చేసింది. తొలి మ్యాచ్ లో ప‌రుగుల వ‌ర్షం కురిపిస్తూ స్టేడియాన్ని హోరెత్తించింది గుజ‌రాత్ జెయింట్స్. 

35
wpl , wpl 2025, cricket,

ఆష్లీ గార్డనర్ సునామీ ఇన్నింగ్స్.. వరుసగా సిక్సర్ల మోత

గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ సునామీ ఇన్నింగ్స్ తో దంచికొట్టారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరీ ముఖ్యంగా ఆష్లీ గార్డనర్  అద్భుతమైన సిక్సర్లతో స్టేడియం హోరెత్తింది. ఆష్లీ గార్డనర్ కేవలం 39 బంతుల్లోనే 79 పరుగులతో చివరి వరకు నాటౌట్ గా ఉన్నారు. 

తన 79 పరుగుల ఇన్నింగ్స్ తో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో దంచి కొట్టారు. తన ఇన్నింగ్స్ కారణంగా  గుజరాత్ జెయింట్స్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. స్మృతి మంధాన నాయ‌క‌త్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఛేజింగ్ ఆరంభంలోనే షాక్ త‌గిలింది. మంచి ట‌చ్ లో ఉన్న కెప్టెన్ మంధాన (9 ప‌రుగులు) రెండో ఓవ‌ర్ లోనే త‌న వికెట్ ను కోల్పోయింది. అదే ఓవ‌ర్ లో డానీ కూడా ఔట్ అయ్యారు. దీంతో 14 ప‌రుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది ఆర్సీబీ. 

45
wpl , wpl 2025, cricket,

గుజ‌రాత్ బ్యాట‌ర్ల ముందు ఆర్సీబీ బౌలింగ్ తేలిపోయింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌ను ప‌రుగులు చేయ‌కుండా అడ్డుకోవ‌డంతో విజ‌యం సాధించ‌లేక‌పోయారు. దీంతో భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. 

వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బెత్ మూనీ క్లాసిక్ ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. 42 బంతుల్లో 56 పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు కొట్టారు. లారా వోల్వార్డ్ట్ 6, దయాళన్ హేమలత 4, సిమ్రాన్ షేక్ 11 పరుగులతో నిరాశపరిచారు. కానీ, కెప్టెన్ ఆష్లీ గార్డనర్ సునామీ బ్యాటింగ్ తో 79 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. 

55
wpl , wpl 2025, cricket,

ఆష్లీ గార్డనర్ సునామీ ఇన్నింగ్స్.. వరుసగా సిక్సర్ల మోత

గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ సునామీ ఇన్నింగ్స్ తో దంచికొట్టారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరీ ముఖ్యంగా ఆష్లీ గార్డనర్  అద్భుతమైన సిక్సర్లతో స్టేడియం హోరెత్తింది. ఆష్లీ గార్డనర్ కేవలం 39 బంతుల్లోనే 79 పరుగులతో చివరి వరకు నాటౌట్ గా ఉన్నారు. 

తన 79 పరుగుల ఇన్నింగ్స్ తో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో దంచి కొట్టారు. తన ఇన్నింగ్స్ కారణంగా  గుజరాత్ జెయింట్స్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. 

స్మృతి మంధాన నాయ‌క‌త్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఛేజింగ్ ఆరంభంలోనే షాక్ త‌గిలింది. మంచి ట‌చ్ లో ఉన్న కెప్టెన్ మంధాన (9 ప‌రుగులు) రెండో ఓవ‌ర్ లోనే త‌న వికెట్ ను కోల్పోయింది. అదే ఓవ‌ర్ లో డానీ కూడా ఔట్ అయ్యారు. దీంతో 14 ప‌రుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది ఆర్సీబీ. 

Read more Photos on
click me!

Recommended Stories