ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. సౌరవ్ గంగూలీ (17), నయాన్ మోంగియా (35), కెప్టెన్ అజారుద్దీన్ (14), అజయ్ జడేజా (1), వీవీఎస్ లక్ష్మణ్ (23) అంతా విఫలమయ్యారు. కానీ సచిన్ మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 143 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 250 పరుగులే చేయగలిగింది.