రాజస్తాన్ రాయల్స్ లో ట్రెస్కో అధినేత సురేశ్ చెల్లారం, అతడి కుటుంబానికి 45 శాతం వాటాలున్నాయి. లచ్లన్ ముర్దోచ్ కు 11.7 శాతం, ఎమర్జింగ్ మీడియాకు 32.4 శాతం, రాజ్ కుంద్రాకు 11.7 శాతం వాటాలున్నాయి. ఐపీఎల్ ప్రారంభం నుంచి 2015 వరకు కుంద్రా.. రాజస్తాన్ ఫ్రాంచైజీలో కీలక సభ్యుడు. రాజస్తాన్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా శిల్పాశెట్టితో పాటు కుంద్రా ప్రత్యక్షమయ్యేవాడు.