ఎలిమినేటర్ మ్యాచ్ కూడా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-15 విజేత ఎవరు..? అన్న ప్రశ్నకు పలువురు మాజీ క్రికెటర్లు తమదైన అంచనా వేసి విజేత ఎవరో తేల్చారు. టీమిండియాకు గతంలో ఆడిన వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, పార్థీవ్ పటేల్ తో పాటు ఆర్సీబీ మాజీ ఆటగాడు డేనియల్ వెటోరీ, క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లేలు ఐపీఎల్ - 2022 విజేతపై తమ అంచనా చెప్పారు.