దక్షిణాఫ్రికాతో సిరీస్ లో రిషభ్ పంత్ తో పాటు కార్తీక్ ను కూడా ఎంపిక చేసినా పంత్ ను పక్కనెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతడికి విశ్రాంతినిచ్చి.. కార్తీక్ ను ఆడించాలని టీమిండియా భావిస్తున్నది. అక్టోబర్ లో ఆసీస్ వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ నాటికల్లా ఈ ఇద్దరిని సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రచిస్తున్నది.