మా అందరికీ అందమైన, ఖరీదైన టీ కప్పుల్లో ఛాయ్ ఇస్తే... ధోనీ మాత్రం ఓ గాజు గ్లాస్లో తాగుతున్నాడు. నాకు ఆశ్చర్యమేసి అడిగా, ఎందుకని గాజు గ్లాస్లో తాగుతున్నావంటే... ఇందులో తాగితే నేను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తుంటుంది? అని సమాధానం చెప్పాడు... ప్రతీ ఒక్కరికీ ఇది ఉండాలి... మన మూలాలు తెలిసి ఉండాలి, అప్పుడే మాహీలాంటి వ్యక్తిత్వం అలవడతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ మాజీ సెలక్టర్, మాజీ వికెట్ కీపర్, కామెంటేటర్ ఎమ్మెస్కే ప్రసాద్..