ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా వికెట్లను తీసిన స్నిన్నర్ మహ్మద్ నవాజ్ ను అతడు సరిగా ఉపయోగించుకోలేదు. అతడిని 13, 14వ ఓవర్ బౌలింగ్ చేయిస్తే బాగుండేది. మరో ముఖ్యమైన విషయం టీ20లలో చివరి మూడు లేదా నాలుగు ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించకూడదు. అదీ రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా వంటి హిట్టర్లు క్రీజులో ఉన్నప్పుడు అస్సలు అలా చేయలేం.