దీనిపై తీవ్ర నిరాశలో ఉన్న వార్నర్ భాయ్ నోరు విప్పాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ మాట్లాడుతూ..‘సన్ రైజర్స్ యజమానులు, ట్రెవోర్ బేలిస్, వీవీఎస్ లక్ష్మణ్, టామ్ మూడీ, ముత్తయ్య మురళీధరన్ లపై నాకు అమితమైన గౌరవముంది. నా విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఏకగ్రీవంగా ఉండాలి. కానీ నన్ను సారథ్య బాధ్యతల నుంచి ఎవరు తప్పించారో నాకు ఇంతవరకు చెప్పలేదు’ అంటూ బాధపడ్డాడు.