గత 11 నెలల కాలంలో విరాట్ కోహ్లీ నుంచి శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, అజింకా రహానే, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కెప్టెన్లుగా అవకాశం దక్కించుకోవడం విశేషం. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసే టీమ్లో శిఖర్ ధావన్కి చోటు ఇవ్వకూడదని టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంతో పాటు ఫిట్నెస్కి మారుపేరైన విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...