మాట్లాడడానికి మనుషులు లేరు... ఒంటరివాడినైపోయా... డిప్రెషన్‌పై విరాట్ కోహ్లీ కామెంట్...

First Published Feb 20, 2021, 12:48 PM IST

విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలో ఓ రన్ మెషిన్. ఓ దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్. అతి తక్కువ కాలంలో 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ప్రపంచ లెజెండరీ క్రికెటర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. అలాంటి కోహ్లీ గత కొంత కాలంగా సెంచరీ చేయలేకపోతున్నాడు. సెంచరీ లేకుండానే 2020 ఏడాదిని ముగించిన కోహ్లీ, ఏడేళ్ల క్రితం ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి చెప్పుకొచ్చాడు...

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విరాట్ కోహ్లీ... వరుసగా మూడు టెస్టుల్లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో రనౌట్ అయిన కోహ్లీ, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో బంతి తక్కువ ఎత్తులో రావడంలో సెంచరీ మిస్ అయ్యాడు. రెండో టెస్టులో అంపైర్స్ కాల్ కారణంగా అవుట్ అయ్యాడు...
undefined
ఈ మధ్యకాలంలో సెంచరీ లేకుండా విరాట్ కోహ్లీ ఇన్ని ఇన్నింగ్స్‌లు ఆడడం ఇదే తొలిసారి. అయితే 2014లో ఇంగ్లాండ్ టూర్‌లో ఇంతకంటే ఘోరమైన ప్రదర్శన ఇచ్చాడు విరాట్.
undefined
10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 135 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ, ఒక్క మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ మార్కు దాటలేకపోయాడు...ఈ టూర్ తర్వాత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లానని, ఏడేళ్ల కిందటి సంగతులను ‘నాట్ జస్ట్ క్రికెట్’ కార్యక్రమంలో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ...
undefined
2014 ఇంగ్లాండ్ టూర్‌ని నా జీవితంలో మరిచిపోలేను. పరుగులు చేయలేకపోతున్నాననే బాధ, నన్ను ఎంతగానే వేధించింది...
undefined
బ్యాట్స్‌మెన్‌గా పరుగులు చేయలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా... ఒక్కసారిగా ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరని అనిపించింది... మాట్లాడేందుకు మనుషులు లేరు, నా మనసులో ఉన్నది చెప్పుకునేందుకు, నన్ను అర్థం చేసుకునేందుకు ఎవ్వరూ లేరని అనిపించింది...
undefined
అంటే నా చుట్టూ ఎవ్వరూ లేరని కాదు... కానీ డిప్రెషన్‌ నన్ను అలాంటి మానసిక స్థితిలోకి నెట్టేసింది. బహుశా ప్రతి క్రికెటర్‌, ఈ స్థితిని జీవితంలో ఒక్కసారైనా ఫేస్ చేస్తారేమో... నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు...
undefined
అలాంటి స్టేజ్ నుంచి బయటపడడానికి ఫిట్‌నెస్‌పైనే ఫోకస్ పెట్టాను. సాధ్యమైనంత సేపు జిమ్‌లో గడపడం అలవాటు చేసుకున్నా.. నాపైన నాకు పోయిన నమ్మకాన్ని తిరిగి వ్యాయామాల ద్వారా సాధించా... మానసిక సమస్యలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు...
undefined
18 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన తాను, కసితో భారత జట్టుకి ఆడాలని నిర్ణయించుకున్నానని’ తెలిపాడు విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్ టూర్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టాడు. 692 పరుగులు చేసి, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
undefined
ప్రస్తుతం దాదాపు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు విరాట్ కోహ్లీ. బ్యాట్స్‌మెన్‌గా పరుగులు చేస్తున్నా, సెంచరీ మార్కు అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు విరాట్. ఫలితంగా టాప్ ప్లేస్ నుంచి టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి పడిపోయాడు కోహ్లీ.
undefined
విరాట్ కోహ్లీ నుంచి కమ్‌బ్యాక్ సెంచరీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు అభిమానులు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్ సెంచరీల మోత మోగిస్తుంటే, విరాట్ కోహ్లీ మాత్రం ఆ మార్కు అందుకోకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది....
undefined
click me!