విరాట్ కోహ్లీకి నెట్‌ ప్రాక్టీస్‌లో గాయం? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ... వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ముందు...

Published : Jun 11, 2021, 03:05 PM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న టీమిండియా అభిమానులకు ఓ వైరల్ న్యూస్ విని, షాక్‌కి గురైనంత పనైంది. ప్రస్తుతం ఫైనల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా కెప్టెన్‌కి గాయమైందని, అది కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందని వార్తలు వచ్చాయి...

PREV
17
విరాట్ కోహ్లీకి నెట్‌ ప్రాక్టీస్‌లో గాయం? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ... వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ముందు...

ఫైనల్ మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు విరాట్ కోహ్లీ అండ్ కో. ఇంగ్లాండ్ పిచ్‌కి, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు డ్యూక్ బాల్స్‌తో ప్రాక్టీస్ మొదలెట్టేశారు...

ఫైనల్ మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు విరాట్ కోహ్లీ అండ్ కో. ఇంగ్లాండ్ పిచ్‌కి, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు డ్యూక్ బాల్స్‌తో ప్రాక్టీస్ మొదలెట్టేశారు...

27

ఈ ప్రాక్టీస్‌లో మహ్మద్ షమీ వేసిన ఓ బాల్, విరాట్ కోహ్లీ మోకాలికి బలంగా తగిలిందని, ఈ గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ కాలి ఎముక దెబ్బతిందని... ఇది తగ్గడానికి మూడు వారాల సమయం పడుతుందని వార్తలు వచ్చాయి...

ఈ ప్రాక్టీస్‌లో మహ్మద్ షమీ వేసిన ఓ బాల్, విరాట్ కోహ్లీ మోకాలికి బలంగా తగిలిందని, ఈ గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ కాలి ఎముక దెబ్బతిందని... ఇది తగ్గడానికి మూడు వారాల సమయం పడుతుందని వార్తలు వచ్చాయి...

37

కీలక మ్యాచ్‌కి ముందు ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు భయాందోళనలకు గురయ్యారు. అయితే బీసీసీఐ అధికారులు, ఈ వార్తలు నిజం కాదని, కేవలం పుకార్లేనంటూ క్లారిటీ ఇచ్చేశారు...

కీలక మ్యాచ్‌కి ముందు ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు భయాందోళనలకు గురయ్యారు. అయితే బీసీసీఐ అధికారులు, ఈ వార్తలు నిజం కాదని, కేవలం పుకార్లేనంటూ క్లారిటీ ఇచ్చేశారు...

47

మరో వారం రోజుల్లో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న టీమిండియా... దానికి ముందు ప్రాక్టీస్‌గా నాలుగు రోజుల ఇన్‌టీమ్ మ్యాచ్ ఆడనుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 11 మంది, అజింకా రహానే కెప్టెన్సీలో మరో 11 మంది ప్లేయర్లతో కలిసి నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నారు.

మరో వారం రోజుల్లో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న టీమిండియా... దానికి ముందు ప్రాక్టీస్‌గా నాలుగు రోజుల ఇన్‌టీమ్ మ్యాచ్ ఆడనుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 11 మంది, అజింకా రహానే కెప్టెన్సీలో మరో 11 మంది ప్లేయర్లతో కలిసి నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నారు.

57

ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత పెద్దగా ప్రాక్టీస్ లేని భారత జట్టుకి ఈ మ్యాచ్ బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. టెస్టు స్పెషలిస్టు ప్లేయర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో కూడా పెద్దగా మ్యాచులు ఆడలేదు. పూజారా రిజర్వు బెంచ్‌కే పరిమితం కాగా, రహానే రెండే మ్యాచులు ఆడాడు

ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత పెద్దగా ప్రాక్టీస్ లేని భారత జట్టుకి ఈ మ్యాచ్ బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. టెస్టు స్పెషలిస్టు ప్లేయర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో కూడా పెద్దగా మ్యాచులు ఆడలేదు. పూజారా రిజర్వు బెంచ్‌కే పరిమితం కాగా, రహానే రెండే మ్యాచులు ఆడాడు

67

ఐపీఎల్ 2021 సీజన్‌లో అమ్ముడుపోని టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారి, ఇంగ్లాండ్ కౌంటీ మ్యాచుల్లో పాల్గొన్నాడు. అయితే కౌంటీల్లో అతని ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా సాగలేదు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో అమ్ముడుపోని టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారి, ఇంగ్లాండ్ కౌంటీ మ్యాచుల్లో పాల్గొన్నాడు. అయితే కౌంటీల్లో అతని ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా సాగలేదు...

77

కౌంటీల్లో ఆడిన అనుభవం సంపాదించిన హనుమ విహారికి అవకాశం ఇస్తారా? లేక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని ఆడిస్తారా? అనేది తేలాల్సి ఉంది.. జడ్డూ, అశ్విన్ ఇద్దరూ స్పిన్నర్లను ఆడించాలని టీమ్ భావిస్తే, హనుమ విహారి రిజర్వు బెంచ్‌కే పరిమితం అవుతాడు.

కౌంటీల్లో ఆడిన అనుభవం సంపాదించిన హనుమ విహారికి అవకాశం ఇస్తారా? లేక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని ఆడిస్తారా? అనేది తేలాల్సి ఉంది.. జడ్డూ, అశ్విన్ ఇద్దరూ స్పిన్నర్లను ఆడించాలని టీమ్ భావిస్తే, హనుమ విహారి రిజర్వు బెంచ్‌కే పరిమితం అవుతాడు.

click me!

Recommended Stories