ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ అందరికంటే ముందుండేవాడు. సచిన్.. అన్ని ఫార్మాట్లలో కలిపి 84 ఇన్నింగ్స్ లలో 3,300 పరుగులు చేశాడు. ఈ రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ.. 3,350 పరుగులు సాధించాడు. ఇందుకు గాను సచిన్ 84 ఇన్నింగ్స్ తీసుకుంటే కోహ్లీ మాత్రం 68 ఇన్నింగ్స్ లలోనే చేరుకోవడం గమనార్హం.