విరాట్ కోహ్లీ ఆ ఇద్దరినీ సరిగ్గా వాడుకుంటే చాలు, విజయం మనదే... మాజీ క్రికెటర్ మనిందర్ సింగ్...

First Published Jun 6, 2021, 11:40 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఇరు జట్లు. అటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించి ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఆత్మవిశ్వాసం నింపుకోవాలని ప్రయత్నిస్తోంది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో డ్యూక్ బాల్ వాడబోతున్నారు. అటు న్యూజిలాండ్ జట్టులో, ఇటు భారత జట్టులో ఎంతో అనుభవం సీనియర్ బ్యాట్స్‌మెన్లతో పాటు యంగ్ సెన్సేషనల్ కుర్రాళ్లు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. బ్యాటింగ్ పరంగా ఇరు జట్లు సమానమనే చెప్పొచ్చు.
undefined
పేస్ బౌలింగ్ విషయానికి వస్తే అటు టిమ సౌథీ, జెమ్మీసన్, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్.. ఇటు మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ... ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నింగ్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇక ఉన్న తేడా ఒక్కటే స్పిన్నర్లు...
undefined
భారత జట్టులో సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రూపంలో అదనపు బలం ఉంది. న్యూజిలాండ్ జట్టులో మిచెల్ సాంట్నర్ ఒక్కడే సీనియర్ స్పిన్నర్.
undefined
సౌంతిప్టన్‌ వేదికగా 2014లో జరిగిన టెస్టులో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు. 2018లో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. అయితే ఈ రెండు టెస్టుల్లోనూ భాగంగా ఉన్న మొయిన్ ఆలీ, 17 వికెట్లు తీసి భారత జట్టును ఘోరంగా దెబ్బ తీశాడు.
undefined
ఇంగ్లాండ్‌లోని మిగిలిన క్రికెట్ గ్రౌండ్లతో పోలిస్తే సౌంతిప్టన్‌లోని ఏంజెస్ బౌల్ స్టేడియం చాలా ప్రత్యేకమైనది, భిన్నమైనది. ఇది స్వింగ్ బౌలర్లకు చక్కగా సహకరిస్తుంది. ఇక్కడ 6 టెస్టులు జరిగితే అందులో పడిన 176 వికెట్లలో 137 వికెట్లు స్వింగ్ బౌలర్లకే దక్కాయి...
undefined
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ఇక్కడ చెప్పుకోదగ్గ రికార్డు లేదు. కాబట్టి వారిని మ్యాచ్ సమయానికల్లా పిచ్‌ను అర్థం చేసుకునేలా తీర్చి దిద్దాలని అంటున్నాడు మనిందర్ సింగ్.
undefined
‘ఫైనల్‌లో అశ్విన్, జడేజాలే కీలకంగా మారతారని నా ఉద్దేశం. ఎందుకంటే బ్యాటింగ్, పేస్ బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉండొచ్చు కానీ మెరుగైన స్పిన్ బౌలర్లు ఉండడం భారత జట్టుకి కలిసి వస్తుంది. మన జట్టులో అశ్విన్, జడేజాల రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు.
undefined
అయితే వారిని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే కోచ్ రవిశాస్త్రి, భారత సారథి విరాట్ కోహ్లీ ఇప్పటినుంచే వారిని మానసికంగా కూడా సిద్ధం చేయాలి. జడేజా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతున్నాడు. జడేజాని జట్టులో చేర్చడం వల్ల ఆల్‌రౌండర్‌ అందుబాటులో ఉన్నట్టు అవుతుంది.
undefined
ఇంగ్లాండ్‌లో ఆడిన 6 టెస్టుల్లో అశ్విన్ 14 వికెట్లు తీసుకున్నాడు. అతను ఇంగ్లాండ్ పిచ్‌ల మీద మరింత మెరుగ్గా రాణించగలడు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు అతను చాలా మెరుగయ్యాడు. అతనికి కావాల్సిన మోటివేషన్ ఇచ్చి, వికెట్లు తీయగలవనే నమ్మకాన్ని నింపే బాధ్యత కోహ్లీ, రవిశాస్త్రిలదే..’ అంటూ చెప్పుకొచ్చాడు మనిందర్ సింగ్.
undefined
click me!