ఇదే విషయమై దుబాయ్ లో ఉన్న ఓ భారత అభిమాని స్పందిస్తూ.. ‘నిజం చెప్పాలంటే ఏసీసీ తీరు నిరాశపరుస్తున్నది. క్రికెట్ ఆడే మిగిలిన దేశాలతో పోలిస్తే మాకు ఇక్కడ (యూఏఈ) జరిగేవే తక్కువ మ్యాచ్ లు. ఇక భారత్ - పాక్ మ్యాచ్ లైతే అది అరుదు. అటువంటిది ఆసియా కప్ లో భాగంగా జరిగే మ్యాచ్ చూడాలని మేం ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నాం..