టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
సెంచూరియన్లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఇప్పటివరకు రెండు టీ20ల్లోనూ దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడో టెస్టులో కూడా దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మరోసారి తొలుత బ్యాటింగ్కు దిగింది. భారత జట్టు ప్లేయింగ్ XIలో రమణదీప్ సింగ్ అరంగేట్రం చేశాడు.
గత మ్యాచ్ లాగే దక్షిణాఫ్రికా జట్టు శుభారంభం చేసింది. రెండో బంతికే టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. మార్కో జాన్సన్ చేతిలో సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో సెంచరీ కొట్టిన సంజూ.. తర్వాతి రెండు మ్యాచ్ లలో నిరాశపరిచాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, అభిషేక్ శర్మలు భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.