ప్రపంచకప్ లో ఓటమి భారత జట్టుకు గుణపాఠాలు నేర్పుతున్నది.ఈ ఓటమి అనంతరం భారత క్రికెట్ జట్టు మాజీలంతా జట్టును విమర్శించాల్సినంత విమర్శించి ఆ తర్వాత కీలక సూచనలు చేస్తున్నారు. బీసీసీఐ ఇప్పటికైనా మేల్కొని టెస్టు, వన్డేలకు ఓ టీమ్, టీ20 లకు ఓ జట్టునూ తయారుచేయాలని సూచిస్తున్నారు. సీనియర్లకు పొట్టి ఫార్మాట్ లో విశ్రాంతినిచ్చి యువరక్తాన్ని నింపాలని వాదిస్తున్నారు.