ముసాయిదా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ దీనిని పీసీబీ వ్యతిరేకిస్తున్నది. తాము ఆడబోయే మ్యాచ్ లను చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరులో మాత్రమే నిర్వహించాలని కోరుతోంది. భారత్ తో మ్యాచ్ మాత్రమే గాక అఫ్గాన్, ఆసీస్ తో తలపడే మ్యాచ్ వేదికను కూడా మార్చాలని పీసీబీ పట్టుబడుతోందట.