ఏ ఛాలెంజ్‌కైనా రెఢీ, ద్రావిడ్ కోచింగ్‌లో ఇంతకుముందు... శ్రీలంక టూర్‌ కెప్టెన్ శిఖర్ ధావన్...

First Published Jun 28, 2021, 11:36 AM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా, ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. ఆగస్టు 4న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ వరకూ వాళ్లకు పెద్దగా పని లేనట్టే. అదే సమయంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో భారత జట్టు, శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే...

భారత మాజీ క్రికెటర్, అండర్ 19 కోచ్ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహారించనున్న ఈ టూర్‌కి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా, భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నారు...
undefined
ఇప్పటికే ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో 14 రోజుల క్వారంటైన్ గడిపిన టీమిండియా క్రికెటర్లు, నేడు శ్రీలంకకి బయలుదేరి వెళ్లనున్నారు...
undefined
శ్రీలంక టూర్‌కి ముందు వీడియో కాన్ఫిరెన్ ద్వారా మీడియాలో మాట్లాడారు కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ శిఖర్ ధావన్. కొత్త కుర్రాళ్లతో కూడిన జట్టు చాలా బాగుందని, ఏ ఛాలెంజ్‌కైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాడు శిఖర్ ధావన్.
undefined
‘టీమ్ చాలా బాగుంది. జట్టుకి ఎంపికైన కొత్త కుర్రాళ్లు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. లంక టూర్‌లో సత్తా చాటేందుకు మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం...
undefined
కెప్టెన్సీలో నాకు ఓ ఛాలెంజ్. ఈ వయసులో కెప్టెన్సీ దక్కడం గౌరవంగా భావిస్తున్నా.. అవసరమైన జట్టును నడిపించగలనని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిదనుకుంటా. కుర్రాళ్లు, స్మార్ట్ వర్క్ చేస్తున్నారు...
undefined
టీమ్‌లో చాలామంది ప్లేయర్లు ఇప్పటికే నిరూపించుకున్నారు కూడా. అనుభవం కలిగిన ప్లేయర్లతో పాటు కుర్రాళ్లను కూడా ఎంపిక చేయడం చాలా మంచి పరిణామం...
undefined
రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో ఇంతకుముందు టీమిండియా ఏ తరుపున ఆడాను. మరోసారి ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా... ’ అంటూ తెలిపాడు భారత సీనియర్ క్రికెటర్, శ్రీలంక టూర్ కెప్టెన్ శిఖర్ ధావన్...
undefined
శ్రీలంక టూర్‌ కోసం ఐపీఎల్‌లో సత్తా చాటిన దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి వంటి కొత్త కుర్రాళ్లను ఎంపిక చేసింది బీసీసీఐ...
undefined
వీరితో పాటు సీనియర్లు మనీశ్ పాండే, శిఖర్ ధావన్‌, భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా,యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్‌లతో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పృథ్వీషా, దీపక్ చాహార్, నవ్‌దీప్ సైనీ, రాహుల్ చాహార్, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లకు అవకాశం దక్కింది.
undefined
జూలై 13 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌లో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది... ప్రస్తుతం ఇంగ్లాండ్‌ టూర్‌లో ఉన్న శ్రీలంక జట్టు, రేపటి నుంచి వన్డే సిరీస్ ఆడనుంది.
undefined
click me!