ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు అవసరమైతే భారత జట్టు ప్లేయర్లను, ప్లేఆఫ్స్ మ్యాచులకు దూరం పెట్టేలా ఫ్రాంఛైజీలకు సూచనలు ఇస్తామని కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కి చేరడంతో రోహిత్ శర్మ కూడా రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ దాకా ఐపీఎల్ 2023 సీజన్ ఆడాడు.. అక్కడే మన క్రికెటర్లకు ఏది ముఖ్యమో, ఏం కావాలో క్లియర్గా తెలిసిపోతోంది.