గతేడాది టీ20 ప్రపంచకప్ లో వైఫల్యమో లేక వన్డే వరల్డ్ కప్ ముందు సన్నాహకాలో ఏమో గానీ వన్డేలలో భారత జట్టు అప్రోచ్ మారింది. టాస్ గెలిచినా, ఓడినా తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే దుమ్ము దులుపుతున్నది. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ తో పాటు ఇటీవల ముగిసిన శ్రీలంకతో సిరీస్ లలో స్కోర్లు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతున్నది.