శనివారం నాటి మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులకే పరిమితమైంది. సూర్య (68 నాటౌట్) ఒక్కడే రాణించాడు. ఇక మోస్తారు లక్ష్య ఛేదనలో ఆర్సీబీ.. 18.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. అనూజ్ రావత్ (66), విరాట్ కోహ్లి (48) లు రాణించారు. ఇది ముంబైకి వరుసగా నాలుగో ఓటమి కాగా.. ఆర్సీబీకి వరుసగా మూడో విజయం