ఇక బుధవారం నాటి మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా కు కేకేఆర్ బౌలర్లు చుక్కలు చూపించారు. తొలి మ్యాచులో భారీ స్కోరు చేసినా పంజాబ్ చేతిలో ఓడామన్న కసి బౌలర్లలో కనిపించింది. దీంతో ఆ జట్టు ప్రధాన బౌలర్లైన సిరాజ్ (1), ఆకాశ్ దీప్ (3), వనిందు హసరంగ (4), హర్షల్ పటేల్ (2) లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో కేకేఆర్ 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 19.2 ఓవర్లలో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది.