T20 World Cup 2024 - Team India : టీ20 వరల్డ్ కప్ 2024 లో భారత స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. జూన్ 1 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 5న ఐర్లాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచారు. ఈ ఇద్దరూ వరల్డ్ కప్ ఆడబోయే జట్టులో ఉండాల్సిందేనని పేర్కొన్నారు.