దీన్నే కర్మ అంటారు బ్రదర్... షోయబ్ అక్తర్‌కి కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ...

First Published Nov 13, 2022, 6:40 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్, గ్రూప్ స్టేజీ నుంచి బ్యాగులు సర్దుకుని వెళ్లాల్సిందే. అయితే నెదర్లాండ్స్ జట్టు, సౌతాఫ్రికాకి షాక్ ఇవ్వడంతో లక్కీగా ఫైనల్ చేరిపోయింది. మరోపక్క టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ ఓడి ఇంటిదారి పట్టింది... టీమిండియా ఓటమితో పిచ్చి కూతులెన్నో కూసిన పాక్ మాజీలు, ఫైనల్ మ్యాచ్ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు...

Mohammad Kaif

‘పాక్ వర్సెస్ ఇంగ్లాండ్... రెండు టీమ్స్‌ వరల్డ్ టీ20లో ది బెస్ట్ టీమ్స్ అంటారా? లేక అదృష్టంతో ఫైనల్‌కి వచ్చాయంటారా?’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. దీనికి హర్భజన్ సింగ్ స్పందించాడు.

Image credit: Getty

‘అంటే నీ ఉద్దేశంలో రెండు టీమ్స్‌ కూడా లక్కీగా ఫైనల్ వచ్చాయంటావా? ఫైనల్‌లో ఈ టీమ్స్ రెండూ బెస్ట్ కాదంటావా? ఊరికే అడుగుతున్నా... నాకు ఈ థ్రిల్లర్ నచ్చింది. గ్రేట్ క్రికెట్... ’ అంటూ కామెంట్ చేశాడు భజ్జీ...

టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో ఐపీఎల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మతో పాటు భారత బౌలర్లను తక్కువ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు పాక్ మాజీ క్రికెటర్లు. ఫైనల్‌లో పాక్ ఓటమితో వీళ్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు...
 

Shami Tweet

ఫైనల్ మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో ఓడిన తర్వాత ‘గుండె బద్ధలైంది’ అన్నట్టుగా ఎమోజీని ట్వీట్ చేశాడు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. దీనికి భారత బౌలర్ మహ్మద్ షమీ ఘాటుగా స్పందించాడు. ‘సారీ బ్రదర్... దీన్నే  కర్మ ’ అంటారు అంటూ అక్తర్‌కి రిప్లై ఇచ్చాడు షమీ...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్ సమయంలో మహ్మద్ షమీపై తీవ్ర స్థాయిలో సైబర్ దాడి జరిగింది. మహ్మద్ షమీ కావాలనే ఆ మ్యాచ్‌లో టీమిండియాని ఓడించాడని పోస్టులు చేస్తూ, అతన్ని, తన కుటుంబాన్ని తీవ్రంగా ట్రోల్ చేశారు నెటిజన్లు..

Mohammed Shami

అయితే మహ్మద్ షమీపై జరిగిన సైబర్ అటాక్ పూర్తిగా పాక్ నుంచే జరిగిందని తేలింది. భారతీయుల పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసి షమీని టార్గెట్ చేస్తూ దూషించారని నిరూపితమైంది. దీనికి రియాక్షన్‌గానే ఇలా జరిగిందని ‘కర్మ’ ట్వీట్ చేశాడు మహ్మద్ షమీ...

click me!