రూ.5 బస్సు టికెట్ కొనలేని స్థితి నుంచి ఎయిర్బస్ ఎక్కేదాకా... నటరాజన్ తల్లి ఏం చెప్పిందంటే...
First Published Dec 9, 2020, 1:49 PM ISTఐపీఎల్ 2020 సీజన్లో మెరిసిన యువ కిషోరం నటరాజన్. సన్రైజర్స్ హైదరాబాద్ తరుపన ఆడిన నటరాజన్, ఐపీఎల్లో యార్కర్లతో అదరగొట్టి, టీమిండియాలో ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు. ముందు ఒకే మ్యాచ్లో ఐదు వికెట్లతో అదరగొట్టిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఆసీస్ టూర్కి ఎంపిక చేసిన సెలక్టర్లు, అతను గాయపడడంతో నటరాజన్కి అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు ఈ యంగ్ సెన్సేషన్.