INDvsAUS: ఆస్ట్రేలియాకి ఊరట విజయం... విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం వృథా...
First Published Dec 8, 2020, 5:27 PM ISTINDvsAUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ టీ20 అభిమానులకి కావాల్సినంత మజాని అందించింది. భారీ స్కోరింగ్ మ్యాచ్లో టీమిండియా ఓడినా... చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ నుంచి ‘కింగ్’ రేంజ్ ఇన్నింగ్స్ చూసే అదృష్టం దక్కింది. వన్డే సిరీస్ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకోగా, టీ20 సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. టీమిండియాకు టీ20ల్లో 11 మ్యాచుల తర్వాత ఇది తొలి ఓటమి కావడం విశేషం. 187 పరుగుల భారీ టార్గెట్తో బరిలో దిగిన టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులకి పరిమితమైంది. ఆసీస్కి 12 పరుగుల తేడాతో విజయం దక్కింది.