సౌరవ్ గంగూలీలో ఇంకా దూకుడు తగ్గలేదు... 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది...
First Published Dec 24, 2020, 11:43 AM ISTబీసీసీఐ బోర్డు మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తన బ్యాటింగ్ టాలెంట్ను మరోసారి రుచి చూపించాడు. అహ్మదాబాద్లో కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియంలో సౌరవ్ గంగూలీ ఎలెవన్, బీసీసీఐ సెక్రటరీ జై షా జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన జై షా జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది.