ఐపీఎల్‌లో 10 టీమ్‌లు వస్తే, ఆ రూల్‌ను మార్చేయండి... సంజయ్ మంజ్రేకర్ కామెంట్..

First Published May 17, 2021, 4:59 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడినా, వచ్చే సీజన్ కోసం భారీగా ప్లాన్‌ చేస్తోంది బీసీసీఐ. మెగా వేలంతో పాటు రెండు కొత్త జట్లను తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే కొత్త జట్ల కోసం నామినేషన్లు, కోటేషన్లు స్వీకరించాల్సి ఉన్నా, కరోనా కారణంగా అది వాయిదా పడింది...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తీసుకురావడానికి ప్రధాన కారణం భారత్‌లో గుర్తింపులేక, కష్టాలు పడుతున్న యువ క్రికెటర్లను ఎంకరేజ్ చేసి, వారి టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం. ఇప్పటికే ఇందులో ఐపీఎల్ సూపర్ సక్సెస్ అయ్యింది.
undefined
ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ప్లేయర్లలో బుమ్రా, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా వంటి మెజారిటీ మంది ఐపీఎల్‌లో రాణించి, టీమిండియాలో చోటు దక్కించుకున్నవాళ్లే. స్వదేశీ ప్లేయర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే తుదిజట్టులో కేవలం నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే ఉండాలనే నిబంధనను తీసుకొచ్చింది ఐపీఎల్ యాజమాన్యం.
undefined
‘ఐపీఎల్‌ను 10 జట్లతో విస్తరించాలని బీసీసీఐ భావిస్తే, తుదిజట్టులో ఐదుగురు ఫారిన్ ప్లేయర్లు ఆడనిచ్చేందుకు అనుమతినివ్వాలి. అలా చూసినా అన్నీ జట్లలో కలిసి దాదాపు 60 భారత ప్లేయర్లు ఆడేందుకు అవకాశం దక్కుతుంది..
undefined
ప్రస్తుతం దేశంలో సత్తా ఉన్న యువ క్రికెటర్లకు కొదువ లేదు. ఐపీఎల్, 50 ఓవర్ల క్రికెట్, టీ20 ఇలా మనకి కావాల్సినదానికంటే రిజర్వు బెంచ్ చాలా బలంగా కనిపిస్తోంది. 1970, 80ల్లో పట్టుమని 13, 14 మంది ప్లేయర్లు మాత్రమే అందుబాటులో ఉండేవాళ్లు.
undefined
వాళ్లే తుది జట్టులోకి వచ్చేవాళ్లు, ఆడేవాళ్లు. ఇప్పుడు ఐపీఎల్ కారణంగా సత్తా ఉన్న యువ క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. మనతో పాటు విదేశీ క్రికెటర్లకు కూడా గుర్తింపు నివ్వాల్సిన బాధ్యత ఐపీఎల్‌పై ఉంది...
undefined
తుది జట్టులో ఐదుగురు విదేశీ ప్లేయర్లు ఆడే అవకాశం కల్పిస్తే, ఫ్రాంఛైజీల మధ్య కూడా పోటీ బాగా ఉంటుంది. నాకు తెలిసి, ఐపీఎల్ ద్వారా 60 మంది స్వదేశీప్లేయర్లు ఆడిస్తే సరిపోతుంది, ఎక్కువైనా సమస్యే’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో జట్టులో నలుగురు ఫారిన్ ప్లేయర్లు మాత్రమే ఉండాలనే రూల్ కారణంగా డేవిడ్ వార్నర్‌కి, రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కలేదని అభిప్రాయపడ్డాడు మంజ్రేకర్.
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు కూడా తుది జట్టులో ఐదుగురు ఫారిన్ ప్లేయర్లు ఆడిపించే అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరాయి...
undefined
ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ రూల్ కారణంగా తీవ్రంగా నష్టపోతోంది. జట్టులోని డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్, రషీద్ ఖాన్ తప్ప... స్వదేశీ ప్లేయర్లలో భువనేశ్వర్ ఒక్కడు తప్ప మిగిలిన ఎవ్వరూ జట్టుకి అవసరమైన పరుగులు చేయలేకపోతున్నారు.
undefined
click me!