వెస్టిండీస్ టూర్లో జరిగిన వన్డే, టీ20 సిరీస్ల్లోనూ బ్యాటింగ్ ఆర్డర్లో రకరకాల ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది టీమిండియా. మొదటి వన్డేలో 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఓపెనర్గా రావాల్సిన రోహిత్ శర్మ, కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం పెద్దగా వర్కవుట్ కాలేదు..