అంతేకాకుండా ధోనీ, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ కారణంగా టీమ్లో తలెత్తిన విభేదాలను కూడా రాజా వెంకట్ బయటపెట్టాడు. ‘2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఓడిపోయింది. దీంతో ప్రపంచ కప్ గెలిచిన 6 నెలలకే ధోనీని, కెప్టెన్సీ నుంచి తప్పించాలని అప్పటి బీసీసీఐ సెలక్టర్లు భావించారు..