ఫైనల్ ఫైట్‌లో రోహిత్ శర్మ జస్ట్ మిస్... ఐపీఎల్ 2020లో నమోదైన రికార్డులు ఇవే...

Published : Nov 12, 2020, 02:24 PM IST

IPL 2020 సీజన్ ముగిసింది. మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి మ్యాచ్ దాకా ఐపీఎల్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత క్రికెట్ మజాను అందించిన ఈ మెగా క్రికెట్ సమరంలో ఎన్నో అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ 13వ సీజన్ ఫైనల్‌లో ఇరు జట్ల కెప్టెన్లు హాఫ్ సెంచరీలు నమోదుచేసి, ఓ రికార్డు క్రియేట్ చేశారు.

PREV
110
ఫైనల్ ఫైట్‌లో రోహిత్ శర్మ జస్ట్ మిస్... ఐపీఎల్ 2020లో నమోదైన రికార్డులు ఇవే...

ఐపీఎల్ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఫైనల్ మ్యాచ్‌లో 69 పరుగులు చేశాడు. ఢిల్లీతో జరిగిన ఫైనల్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఐపీఎల్ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఫైనల్ మ్యాచ్‌లో 69 పరుగులు చేశాడు. ఢిల్లీతో జరిగిన ఫైనల్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

210

రోహిత్ శర్మ మరో 2 పరుగులు చేసి ఉంటే, ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసేవాడు. అలాగే ఫైనల్ మ్యాచ్‌లో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. 5 పరుగుల తేడాతో ఫైనల్ మ్యాచ్‌లో హైయెస్ట్ రన్స్ చేసిన కెప్టెన్‌ రికార్డు మిస్ అయ్యాడు అయ్యర్.

రోహిత్ శర్మ మరో 2 పరుగులు చేసి ఉంటే, ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసేవాడు. అలాగే ఫైనల్ మ్యాచ్‌లో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. 5 పరుగుల తేడాతో ఫైనల్ మ్యాచ్‌లో హైయెస్ట్ రన్స్ చేసిన కెప్టెన్‌ రికార్డు మిస్ అయ్యాడు అయ్యర్.

310

ఐపీఎల్ ఫైనల్‌లో ఇద్దరు కెప్టెన్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2016 ఫైనల్‌లో కూడా డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు చేశారు. అప్పుడు కూడా  కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేసిన వార్నర్ టీమ్ విజయం సాధించడం విశేషం.

ఐపీఎల్ ఫైనల్‌లో ఇద్దరు కెప్టెన్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2016 ఫైనల్‌లో కూడా డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు చేశారు. అప్పుడు కూడా  కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేసిన వార్నర్ టీమ్ విజయం సాధించడం విశేషం.

410

2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 5 హాఫ్ సెంచరీలతో 516 పరుగులు చేసిన ఇషాన్ కిషన్... ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 5 హాఫ్ సెంచరీలతో 516 పరుగులు చేసిన ఇషాన్ కిషన్... ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

510

అంతేకాకుండా సీజన్‌లో 30 సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్, 2008లో ముంబై ఇండియన్స్ తరుపున సనత్ జయసూర్య 35 సిక్సర్ల తర్వాత  ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ముంబై బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కిషన్.

 

అంతేకాకుండా సీజన్‌లో 30 సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్, 2008లో ముంబై ఇండియన్స్ తరుపున సనత్ జయసూర్య 35 సిక్సర్ల తర్వాత  ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ముంబై బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కిషన్.

 

610

2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్... 5 హాఫ్ సెంచరీలతో 473 పరుగులు చేసి ఆరంగ్రేటం సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 

2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్... 5 హాఫ్ సెంచరీలతో 473 పరుగులు చేసి ఆరంగ్రేటం సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 

710

ఐపీఎల్‌లో 550+ కి పైగా ఫోర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన శిఖర్ ధావన్... గత రెండు సీజన్లలోనూ అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌లో 550+ కి పైగా ఫోర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన శిఖర్ ధావన్... గత రెండు సీజన్లలోనూ అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు.

810

 2010, 2011 సీజన్లలో సచిన్ టెండూలర్క్ తర్వాత వరుస సీజన్లలో అత్యధిక ఫోర్లు బాదిన భారత క్రికెటర్ గబ్బర్. మధ్యలో 2015, 16, 17 సీజన్లలో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్‌గా వరుసగా మూడు సీజన్లలో రికార్డు క్రియేట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.

 2010, 2011 సీజన్లలో సచిన్ టెండూలర్క్ తర్వాత వరుస సీజన్లలో అత్యధిక ఫోర్లు బాదిన భారత క్రికెటర్ గబ్బర్. మధ్యలో 2015, 16, 17 సీజన్లలో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్‌గా వరుసగా మూడు సీజన్లలో రికార్డు క్రియేట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.

910

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఇషాన్ కిషన్ 516, డి కాక్ 503, సూర్యకుమార్ యాదవ్ 480 ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఒకే సీజన్‌లో 475+ స్కోర్లు నమోదుచేశారు. ఇంతకుముందు 2015లో ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ, క్రిస్‌గేల్ మాత్రమే ఆర్‌సీబీ తరుపున ఈ ఫీట్ సాధించారు.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఇషాన్ కిషన్ 516, డి కాక్ 503, సూర్యకుమార్ యాదవ్ 480 ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఒకే సీజన్‌లో 475+ స్కోర్లు నమోదుచేశారు. ఇంతకుముందు 2015లో ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ, క్రిస్‌గేల్ మాత్రమే ఆర్‌సీబీ తరుపున ఈ ఫీట్ సాధించారు.

1010

ఈ సీజన్‌లో మొత్తంగా 734 సిక్సర్లు నమోదుకాగా... అందులో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ నుంచి 137 సిక్సర్లు వచ్చాయి. రాజస్థాన్ 105 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా పంజాబ్ 98, ఢిల్లీ 88, కేకేఆర్ 86, సన్‌రైజర్స్ 79, చెన్నై 75, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 66 సిక్సర్లు మాత్రమే బాదారు. టాప్‌లో నిలిచిన ముంబై కొట్టిన సిక్సర్లతో సగం కొట్టలేకపోయింది నాలుగో స్థానంలో నిలిచిన విరాట్ టీమ్.

ఈ సీజన్‌లో మొత్తంగా 734 సిక్సర్లు నమోదుకాగా... అందులో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ నుంచి 137 సిక్సర్లు వచ్చాయి. రాజస్థాన్ 105 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా పంజాబ్ 98, ఢిల్లీ 88, కేకేఆర్ 86, సన్‌రైజర్స్ 79, చెన్నై 75, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 66 సిక్సర్లు మాత్రమే బాదారు. టాప్‌లో నిలిచిన ముంబై కొట్టిన సిక్సర్లతో సగం కొట్టలేకపోయింది నాలుగో స్థానంలో నిలిచిన విరాట్ టీమ్.

click me!

Recommended Stories