సిడ్నీ టెస్టులో ఓపెనర్గా రోహిత్ శర్మ... మయాంక్ అగర్వాల్ అవుట్... శుబ్మన్ గిల్తో కలిసి...
First Published Jan 5, 2021, 1:02 PM ISTబాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించినా... ఓపెనింగ్ వైఫల్యం భారత జట్టును వేధించింది. మొదటి టెస్టులో పృథ్వీషా ఘోరంగా ఫెయిల్ అయితే, రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఆసీస్ టూర్లో ఇప్పటిదాకా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన మయాంక్ అగర్వాల్, సిడ్నీ టెస్టు మ్యాచులో తుది జట్టుకి దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.