2007 టీ20 వరల్డ్ కప్లో రెండు సార్లు తలబడ్డాయి ఇండియా, పాకిస్తాన్. గ్రూప్ డీలో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. అప్పటికి సూపర్ ఓవర్ ద్వారా రిజల్ట్ తేల్చే విధానం అమలులోకి రాలేదు. దీంతో టీమిండియా, బాల్-అవుట్లో పాక్ని ఓడించింది... ఈ మ్యాచ్లో 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, టీమిండియా తరుపున టాప్ స్కోరర్గా నిలిచాడు...