బుమ్రా టెస్టు క్రికెట్ ను ఏలుతాడని, అతడు తన వ్యూహాలు, ప్రణాళికలతో జట్టును మరింత ముందుకు తీసుకెళ్తాడని కొద్దికాలంగా క్రికెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంగ్లాండ్ తో ఇటీవలే ఎడ్జ్బాస్టన్ వేదికగా ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టు లో అతడు భారత్ కు సారథ్యం వహించాడు. అయితే తొలి నాలుగు రోజులు ఆ టెస్టులో భారత్ దే ఆధిపత్యం అయినప్పటికీ చివర్లో పట్టు విడవడంతో ఓటమి తప్పలేదు.