ఈ ముగ్గురినీ వేలానికి విడుదల చేస్తే ఆర్సీబీ పర్సులో ఏకంగా 27 కోట్ల రూపాయలు వచ్చి చేరతాయి. దీంతో యంగ్ ప్లేయర్లను, ఫారిన్ ప్లేయర్లను కొనుగోలు చేయాలని ఆలోచిస్తోందట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. వీరితో పాటు ఐపీఎల్ 2023 సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయిన కుర్రాళ్లు షాబజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, సుయాశ్ ప్రభుదేశాయ్లను కూడా వేలానికి విడుదల చేసే అవకాశం ఉంది.