రిషబ్ పంత్ కు జడేజా షాక్..
ఒకవైపు జడేజా అదరగొడుతుండగా, మరోవైపు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 1 పరుగులకే ఔట్ కావడంతో ప్రభావం చూపలేకపోయాడు. రెండవ ఇన్నింగ్స్లో కూడా పంత్ అకట్టుకోలేకపోయాడు. 17 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
ఢిల్లీపై సౌరాష్ట్ర అద్భుత విజయంలో 12 వికెట్లు తీసినందుకు రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. జడేజా తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి తన జట్టుకు 10 వికెట్ల విజయాన్ని అందించాడు.