టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించడం అంటే టీ20ల్లో సెంచరీ కొట్టడం కంటే గొప్ప విషయమే.. చాలామంది లెజెండరీ క్రికెటర్లకు కూడా ఈ డబుల్ సెంచరీ కోరిక తీరనేలేదు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులోనూ రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు..
జడ్డూతో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, 96 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు...
210
రిషబ్ పంత్ సెంచరీ ముంగిట అవుటై నిరాశగా పెవిలియన్ చేరితే, రవీంద్ర జడేజా మాత్రం 175 పరుగులతో నాటౌట్గా నిలిచి డబుల్ సెంచరీ అందుకోలేకపోయాడు...
310
కారణం రవీంద్ర జడేజా 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 175 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది టీమిండియా...
410
జడ్డూకి డిక్లేర్ గురించి చెబితే, డబుల్ సెంచరీకి కావాల్సిన 25 పరుగులను ఒకే ఒక్క ఓవర్లో కొట్టేసేవాడే. లేదా మరో నాలుగైదు, ఓవర్లు ఆగి ఉంటే జడ్డూ ఖాతాలో ఆ ద్విశతకం చేరి ఉండేది...
510
అలా కాకుండా 130వ ఓవర్లో ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే, ఇన్నింగ్స్ని డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.
610
అయితే ఈ నిర్ణయంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్పైనే ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నాయి. కారణం ద్రావిడ్ కెప్టెన్గా ఉన్న సమయంలో సచిన్ టెండూల్కర్ ఇలాగే డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు...
710
2004లో ముల్తాన్ టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ 375 బంతుల్లో 39 ఫోర్లు, 6 సిక్సర్లతో 309 పరుగులు చేసి అవుట్ కాగా సచిన్ టెండూల్కర్ 348 బంతుల్లో 21 ఫోర్లతో 194 పరుగులతో క్రీజులో ఉన్నాడు...
810
మరో 6 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ అందుకుంటాడని అనుకుంటున్న సమయంలో వచ్చేయమంటూ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్కి గురి చేశాడు రాహుల్ ద్రావిడ్...
910
క్రీజులో ఉన్న సచిన్ టెండూల్కర్ కూడా రాహుల్ ద్రావిడ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. డబుల్ సెంచరీ మిస్ అయినందుకు బాగా ఫీల్ అయ్యాడు...
1010
తాజాగా రవీంద్ర జడేజా 175 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా ఉండడంపై ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు...