అయితే, ఐపీఎల్ టైటిల్ ఫ్రైజ్ కంటే అధికంగా, ఇంత భారీగా మనీ చెల్లించిన ప్లేయర్లను దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్ల మాత్రమే కాకుండా క్రికెట్ ప్రియులు, విశ్లేషకులు సైతం రూ.20 కోట్లకు పైగా ఒక్క ప్లేయర్ కోసం ఖర్చు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు ఇది వెర్రి, పిచ్చి అంటూ ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీలపై సోషల్ మీడియాలో పంచులు పెలుతున్నాయి.