ఆసియా కప్ - 2023 ను ఎలాగైనా తమ దేశంలో నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ దిశగా మరోసారి బెదిరింపులనే ఆయుధంగా చేసుకున్నది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షరతుల మేరకు హైబ్రిడ్ మోడల్ ను కూడా అంగీకరించిన పీసీబీ.. తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్ లు ఇచ్చిన షాకులతో సతమతమవుతోంది.