ధోనీ శకం ఆరంభమైన రోజు... 16 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌పై మహీ మ్యాజిక్...

Published : Apr 05, 2021, 12:44 PM ISTUpdated : Apr 05, 2021, 01:05 PM IST

2005, ఏప్రిల్ 5... భారత క్రికెట్ చరిత్రలో ఓ స్టార్, ప్రపంచానికి పరిచయం అయిన రోజు. సరిగ్గా 16 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు, అంతర్జాతీయ కెరీర్‌లో మొట్టమొదటి సెంచరీ బాదాడు మహేంద్ర సింగ్ ధోనీ... అంతే, అక్కడి నుంచి మహేంద్ర సింగ్ ధోనీ, వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు...

PREV
19
ధోనీ శకం ఆరంభమైన రోజు... 16 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌పై మహీ మ్యాజిక్...

పాకిస్తాన్‌తో విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్రికెట్ స్టేడియంలో రెండో వన్డే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, సచిన్ టెండూల్కర్ వికెట్ త్వరగా కోల్పోయింది. 8 బంతులాడిన సచిన్ టెండూల్కర్ 2 పరుగులకే రనౌట్ అయ్యాడు...

పాకిస్తాన్‌తో విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్రికెట్ స్టేడియంలో రెండో వన్డే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, సచిన్ టెండూల్కర్ వికెట్ త్వరగా కోల్పోయింది. 8 బంతులాడిన సచిన్ టెండూల్కర్ 2 పరుగులకే రనౌట్ అయ్యాడు...

29

అప్పటికే నాలుగు మ్యాచుల్లో ఫెయిల్ అయిన మహేంద్ర సింగ్ ధోనీని వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి పంపాడు భారత సారథి సౌరవ్ గంగూలీ. అప్పటికే ఓ ఎండ్‌లో బౌండరీల మోత మోగిస్తున్నాడు వీరేంద్ర సెహ్వాగ్...

అప్పటికే నాలుగు మ్యాచుల్లో ఫెయిల్ అయిన మహేంద్ర సింగ్ ధోనీని వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి పంపాడు భారత సారథి సౌరవ్ గంగూలీ. అప్పటికే ఓ ఎండ్‌లో బౌండరీల మోత మోగిస్తున్నాడు వీరేంద్ర సెహ్వాగ్...

39

40 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ అవుటైన తర్వాత తన దూకుడు మొదలెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ...  123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి రెండో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం జోడించాడు...

40 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ అవుటైన తర్వాత తన దూకుడు మొదలెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ...  123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి రెండో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం జోడించాడు...

49

52 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 159 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియా భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది టీమిండియా...

52 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 159 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియా భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది టీమిండియా...

59

పాకిస్తాన్ 44.1 ఓవర్లలో 298 పరుగులకి ఆలౌట్ కావడంతో టీమిండియాకి 58 పరుగుల తేడాతో విజయం దక్కింది. బ్యాటింగ్‌లో ఇరగదీసిన మహేంద్ర సింగ్ ధోనీ, అబ్దుల్ రజాక్, నవీద్ అల్ హసన్‌ల క్యాచ్‌లను అందుకుని వికెట్ కీపర్‌గానూ ఇంప్రెస్ చేశాడు...

పాకిస్తాన్ 44.1 ఓవర్లలో 298 పరుగులకి ఆలౌట్ కావడంతో టీమిండియాకి 58 పరుగుల తేడాతో విజయం దక్కింది. బ్యాటింగ్‌లో ఇరగదీసిన మహేంద్ర సింగ్ ధోనీ, అబ్దుల్ రజాక్, నవీద్ అల్ హసన్‌ల క్యాచ్‌లను అందుకుని వికెట్ కీపర్‌గానూ ఇంప్రెస్ చేశాడు...

69

జుంపాల జుట్టుతో అప్పటి పాక్ ప్రధాని ముషారఫ్‌ను కూడా ఇంప్రెస్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఇన్నింగ్స్‌కి ఫిదా అయిన ముషారఫ్, ‘మాహీ... నీ జుట్టుని మాత్రం కట్ చేయకు’ అంటూ సూచించాడు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే తన పొడవాటి జట్టును కత్తిరించాడు మహేంద్ర సింగ్ ధోనీ..

జుంపాల జుట్టుతో అప్పటి పాక్ ప్రధాని ముషారఫ్‌ను కూడా ఇంప్రెస్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఇన్నింగ్స్‌కి ఫిదా అయిన ముషారఫ్, ‘మాహీ... నీ జుట్టుని మాత్రం కట్ చేయకు’ అంటూ సూచించాడు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే తన పొడవాటి జట్టును కత్తిరించాడు మహేంద్ర సింగ్ ధోనీ..

79

ఈ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా సుస్థిర స్థానం సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2007లో టీ20 వరల్డ్‌కప్‌కి సారథిగా వ్యవహారించాడు. 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ధోనీ సేన, 2011లో వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది...

ఈ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా సుస్థిర స్థానం సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2007లో టీ20 వరల్డ్‌కప్‌కి సారథిగా వ్యవహారించాడు. 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ధోనీ సేన, 2011లో వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది...

89

భారత క్రికెట్‌లో ధోనీ శకానికి ఆరంభం పలికిన రోజు నేడే... క్రికెట్ వరల్డ్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు...

భారత క్రికెట్‌లో ధోనీ శకానికి ఆరంభం పలికిన రోజు నేడే... క్రికెట్ వరల్డ్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు...

99


సరిగ్గా ఇదే రోజు... ధోనీ కంటే తొమ్మిదేళ్ల క్రితం 1996లొ పాకిస్తాన్‌పై మొట్టమొదటి వన్డే సెంచరీ నమోదుచేశాడు సచిన్ టెండూల్కర్. 


సరిగ్గా ఇదే రోజు... ధోనీ కంటే తొమ్మిదేళ్ల క్రితం 1996లొ పాకిస్తాన్‌పై మొట్టమొదటి వన్డే సెంచరీ నమోదుచేశాడు సచిన్ టెండూల్కర్. 

click me!

Recommended Stories