ఐపీఎల్ 2021 సీజన్లో ఆరు మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పాయింట్ల పట్టికలో టాప్లో కొనసాగుతున్న ఆర్సీబీకి రెండు మ్యాచుల్లో ఒంటి చేత్తో విజయాలు అందించాడు ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్. కోహ్లీ కంటే కూడా ఏబీడీని ఓపెనర్గా పంపిస్తే బాగుంటుందని కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.