ఈ ఏడాది ప్రారంభంలో సౌతాఫ్రికా టూర్లో మొదటి టెస్టు గెలిచినా ఆ తర్వాత రెండు టెస్టులు, మూడు వన్డేల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు, స్వదేశంలో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది... జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ఇండియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లు పాల్గొనడం లేదు.. సౌతాఫ్రికాలో వన్డే సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే స్వదేశంలో టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా...